ఆత్మకూరు(పున్నమి ప్రతినిధి): మర్రిపాడు మండలం పరిధిలోని చుంచులూరు వద్ద నేషనల్ హైవే 565 పై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.కలువాయి కు చెందిన వారు ఖాజీపేట పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి అకస్మాత్తుగా ఆవులు అడ్డు రావడంతో వాటిని తప్పించేందుకు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయగా మినీ ట్రక్కు ఆటో అదుపుతప్పి తిరగబడింది.ఆటోలో 20 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, ప్రమాదంలో పదిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.తీవ్ర గాయాలపాలైన వారిని 108 అంబులెన్స్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై మర్రిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


