శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిపట్టణంలోని 34వ వార్డు బీపీ అగ్రహారానికి చెందిన చిట్టుమూరి సరోజమ్మ అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం సరోజమ్మ నివాసానికి చేరుకున్న ఆయన, ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సరోజమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిలో ధైర్యం నింపారు. ఈ కష్ట సమయంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో న్యాయవాది సున్నపు లక్ష్మీపతి రెడ్డి, ఆర్కాడు శంకర్, వైకాపా పట్టణ యువజన అధ్యక్షుడు మల్లెంబాక ముని కృష్ణారెడ్డి, జయకృష్ణ రెడ్డి, రాజశేఖర్ ఆది, మురళి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సరోజమ్మ మృతి తీరని లోటు-మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిపట్టణంలోని 34వ వార్డు బీపీ అగ్రహారానికి చెందిన చిట్టుమూరి సరోజమ్మ అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం సరోజమ్మ నివాసానికి చేరుకున్న ఆయన, ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సరోజమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిలో ధైర్యం నింపారు. ఈ కష్ట సమయంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో న్యాయవాది సున్నపు లక్ష్మీపతి రెడ్డి, ఆర్కాడు శంకర్, వైకాపా పట్టణ యువజన అధ్యక్షుడు మల్లెంబాక ముని కృష్ణారెడ్డి, జయకృష్ణ రెడ్డి, రాజశేఖర్ ఆది, మురళి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

