ముస్తా బాద్ మార్చి పున్నమి ప్రతినిధి
భిసీ సాధికారిక సంఘం బలోపేతంలో భాగంగా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో బీసీ సాధికారిక గ్రామ శాఖను ఏర్పాటు చేశారు. మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుద్దాల దేవయ్య ఆధ్వర్యంలో, సర్పంచ్ మా శెట్టి లక్ష్మణ్ అధ్యక్షతన గ్రామంలోని బీసీ కులాల పెద్దల సమక్షంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా వీరవేని అమర్, ఉపాధ్యక్షులుగా మద్దికుంట రవి, మేకల ఎల్లం, కార్యదర్శిగా గాడిచెర్ల కిషన్, ప్రచార కార్యదర్శిగా చిలువేరు శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శిగా కొడిమ్యాల సతీష్, ప్రధాన కార్యదర్శిగా కంచర్ల దేవేందర్, కోశాధికారిగా జెల్ల బాలనర్సు, ఇన్చార్జిగా సుద్దాల ప్రవీణ్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోతే బీసీలంతా ఏకమై ఉద్యమం చేస్తామని తెలిపారు.


