తాళ్లపూడి,(తూర్పుగోదావరి,పున్నమి ప్రతినిధి ), మార్చి 21:ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మరియు గోపాలపురం నియోజకవర్గ పరిశీలకుడిగా తోట రామకృష్ణ నియమితులైన సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు ఘనంగా సత్కారం నిర్వహించారు.
వేగేశ్వరపురం సర్పంచ్ మరియు తాళ్లపూడి మండలం సర్పంచ్ ఛాంబర్ అధ్యక్షులు కొమ్మిరెడ్డి పరశురామారావు, గ్రామ కమిటీ అధ్యక్షులు భగవాన్, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, నల్లజర్ల మండల వైస్ ఎంపీపీ శివాజీ, సచివాలయ కన్వీనర్ వీరబద్రరావు, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు అచ్చుత వెంకట స్వామి తదితరులు మర్యాదపూర్వకంగా కలసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు ఇంటి వీర్రాజు కూడా పాల్గొన్నారు.


