శ్రీకాళహస్తి, మార్చి 20: మండలంలోని ముచ్చివోలు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామస్వామి దేవాలయ మహాకుంభాభిషేకం ఈ నెల 25న ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ సేవా సమితి, హరేరామ భజన బృందం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మార్చి 23 నుంచి 25 వరకు మూడు రోజులపాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ సహకారంతో నిర్మితమైన ఈ ఆలయంలో 23, 24 తేదీలలో విశ్వక్సేన పూజలు, పుణ్యాహవాచనం, అంకురార్పణం, హోమాలు, గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. 25వ తేదీ ఉదయం 9:48 నుంచి 9:52 గంటల మధ్య మహాకుంభాభిషేకం నిర్వహించి, అనంతరం పూర్ణాహుతి, బింబస్థాపన, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజు శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరగనుంది. మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆధ్యాత్మిక రంగంలో ముందంజలో ఉన్న ముచ్చివోలు గ్రామంలో జరుగుతున్న ఈ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.

ముచ్చివోలులో 25న ఘనంగా శ్రీ సీతారామస్వామి ఆలయ మహాకుంభాభిషేకం
శ్రీకాళహస్తి, మార్చి 20: మండలంలోని ముచ్చివోలు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామస్వామి దేవాలయ మహాకుంభాభిషేకం ఈ నెల 25న ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ సేవా సమితి, హరేరామ భజన బృందం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మార్చి 23 నుంచి 25 వరకు మూడు రోజులపాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ సహకారంతో నిర్మితమైన ఈ ఆలయంలో 23, 24 తేదీలలో విశ్వక్సేన పూజలు, పుణ్యాహవాచనం, అంకురార్పణం, హోమాలు, గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. 25వ తేదీ ఉదయం 9:48 నుంచి 9:52 గంటల మధ్య మహాకుంభాభిషేకం నిర్వహించి, అనంతరం పూర్ణాహుతి, బింబస్థాపన, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజు శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరగనుంది. మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆధ్యాత్మిక రంగంలో ముందంజలో ఉన్న ముచ్చివోలు గ్రామంలో జరుగుతున్న ఈ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.

