ముస్తా బాద్/ మార్చి /పున్నమి ప్రతినిధి
ఈరోజు నామాపూర్ గ్రామంలోని మసీదు వద్ద రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రోజా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి నారాయణ గారి ఆధ్వర్యంలో, గ్రామ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, పరస్పర సౌహార్దాన్ని చాటుతూ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
.

