లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఆర్.జి.ఎం, టీడీపీ నేత సోమశెట్టి వెంకటేశ్వర్లు,
ఏటా రూ. 207 కోట్ల సబ్సిడీతో ప్రభుత్వ భరోసా
కర్నూలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఘనంగా కార్యక్రమం
పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఆర్.జి.ఎం, టీడీపీ నేత సోమశెట్టి వెంకటేశ్వర్లు, తదితరులు
కర్నూలు, మార్చి 18 (పున్నమి న్యూస్):
సమాజ ప్రగతికి సమాన అవకాశాలే పునాది అనే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, వారిలో ఆత్మవిశ్వాసం నింపడమే లక్ష్యంగా “దివ్యాంగ శక్తి” పథకానికి రూపకల్పన చేసింది.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దివ్యాంగులు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 207 కోట్ల భారీ సబ్సిడీని భరిస్తూ దివ్యాంగులకు కొండంత భరోసాను ఇస్తోంది.
అర్హతలు ఇవే..
RPwD చట్టం-2016 ప్రకారం గుర్తించిన 21 రకాల వైకల్యాలలో.. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన వారు తమ గుర్తింపు కార్డులతో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఘనంగా వేడుక:
దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రత్యేక సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (RGM) తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సోమశెట్టి వెంకటేశ్వర్లు, ఇతర రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున హాజరై తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రయాణ ఖర్చుల భారం లేకుండా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Uploaded Video:



