ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి ( పున్నమి ప్రతినిధి) .సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం కాగితాలపూరు వద్ద జాతీయ రహదారి పక్కనున్న సర్వే నంబర్ 434-Aలో 4.28 ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ వేసి, పాత జీపీఏలతో అక్రమ రిజిస్ట్రేషన్లకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి కుట్ర జరుగుతోందని తెలిపారు. అధికారులు ఒత్తిడికి లొంగవద్దని హెచ్చరించారు.

100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు: స్థలాన్ని పరిశీలించిన కాకాణి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి ( పున్నమి ప్రతినిధి) .సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం కాగితాలపూరు వద్ద జాతీయ రహదారి పక్కనున్న సర్వే నంబర్ 434-Aలో 4.28 ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ వేసి, పాత జీపీఏలతో అక్రమ రిజిస్ట్రేషన్లకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి కుట్ర జరుగుతోందని తెలిపారు. అధికారులు ఒత్తిడికి లొంగవద్దని హెచ్చరించారు.

