శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు, టిటిడి పాలకమండలి అధ్యక్షుడు బి.ఆర్. నాయుడుపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తిరుమల, తిరుపతి వంటి పవిత్ర ప్రాంతాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. టిటిడిలో గతంలో జరిగిన అవకతవకలను బయటపెడుతున్న నేపథ్యంలో బి.ఆర్. నాయుడుపై వ్యక్తిగత విమర్శలు చేయడం, దాడులకు యత్నించడం అనేది అనుచితమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పరకామణి వద్ద జరిగిన విదేశీ కరెన్సీ, బంగారు బిస్కెట్ల చోరీ ఘటనల్లో భూమన పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. తిరుపతి నగర ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొంతమంది నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో టిటిడి వ్యవహారాల్లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తుండటంతోనే ఈ విధమైన ఆరోపణలు, ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, తిరుపతి పార్లమెంటు నాయకుడు గంగనపల్లి రమేష్, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు తదితరులుటిడిపి పాల్గొని భూమన వ్యాఖ్యలను ఏకగ్రీవంగా ఖండించారు.

భూమన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన శ్రీకాళహస్తి టిడిపి నేతలు
శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు, టిటిడి పాలకమండలి అధ్యక్షుడు బి.ఆర్. నాయుడుపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తిరుమల, తిరుపతి వంటి పవిత్ర ప్రాంతాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. టిటిడిలో గతంలో జరిగిన అవకతవకలను బయటపెడుతున్న నేపథ్యంలో బి.ఆర్. నాయుడుపై వ్యక్తిగత విమర్శలు చేయడం, దాడులకు యత్నించడం అనేది అనుచితమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పరకామణి వద్ద జరిగిన విదేశీ కరెన్సీ, బంగారు బిస్కెట్ల చోరీ ఘటనల్లో భూమన పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. తిరుపతి నగర ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొంతమంది నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో టిటిడి వ్యవహారాల్లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తుండటంతోనే ఈ విధమైన ఆరోపణలు, ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, తిరుపతి పార్లమెంటు నాయకుడు గంగనపల్లి రమేష్, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు తదితరులుటిడిపి పాల్గొని భూమన వ్యాఖ్యలను ఏకగ్రీవంగా ఖండించారు.

