శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ‘ప్రజా వినతుల స్వీకరణ’ కార్యక్రమాన్ని నిర్వహించి నియోజకవర్గ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించగా, ఆయన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా పాలనను ప్రజల ముంగిటకే తీసుకువస్తోందన్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన పలువురు వినతులపై వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం దిశగా అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన రాజకీయ ప్రయాణానికి ప్రధాన ఉద్దేశ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ప్రజల సమస్యల పరిష్కారమే టిడిపి లక్ష్యం – ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ‘ప్రజా వినతుల స్వీకరణ’ కార్యక్రమాన్ని నిర్వహించి నియోజకవర్గ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించగా, ఆయన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా పాలనను ప్రజల ముంగిటకే తీసుకువస్తోందన్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన పలువురు వినతులపై వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం దిశగా అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన రాజకీయ ప్రయాణానికి ప్రధాన ఉద్దేశ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

