ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ పట్టణంలో బద్దిపడగే ప్రతాప్ రెడ్డి గారి నూతన గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోతుగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్న ప్రతాప్ రెడ్డి గారి ఇంటి గృహప్రవేశ వేడుకలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గా పాల్గొని గృహప్రవేశం సందర్భంగా ప్రతాప్ రెడ్డి గారిని అభినందించారు. అలాగే రాష్ట్ర నాయకులు చక్రధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి తదితరులు గౌరవ అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు ప్రతాప్ రెడ్డి గారికి పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


