శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణ పొలిమేరలో ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకంలో భాగంగా రైతులకు మూడో విడతగా రూ.6,000 నిధులు విడుదలైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చని పంట పొలాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం ద్వారా మూడో విడతగా రూ.6,000 జమ చేయడంతో రైతు కుటుంబాల్లో ఉగాది ఆనందం నెలకొన్నదన్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రైతులకు మొత్తం రూ.20,000 ఆర్థిక సహాయం అందుతుందని 2025–26 సంవత్సరానికి ఈ పథకం కింద రైతులకు మొత్తం రూ.8,985.41 కోట్లు అందుతుండగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.6,560.18 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.2,425.23 కోట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఎక్కువ సాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 జూలై నాటికి, పోలవరం ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శులు డా.జి. దశరథాచారి, గాలి చలపతి నాయుడు, మిన్నల్ రవి, యం. సుబ్బయ్య, డా.యం. ఉమేష్ రావు, వజ్రం కిషోర్, తీర్థం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు రూ.6 వేల సాయం… శ్రీకాళహస్తిలో తేదీపా పాలాభిషేకం
శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణ పొలిమేరలో ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకంలో భాగంగా రైతులకు మూడో విడతగా రూ.6,000 నిధులు విడుదలైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చని పంట పొలాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం ద్వారా మూడో విడతగా రూ.6,000 జమ చేయడంతో రైతు కుటుంబాల్లో ఉగాది ఆనందం నెలకొన్నదన్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రైతులకు మొత్తం రూ.20,000 ఆర్థిక సహాయం అందుతుందని 2025–26 సంవత్సరానికి ఈ పథకం కింద రైతులకు మొత్తం రూ.8,985.41 కోట్లు అందుతుండగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.6,560.18 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.2,425.23 కోట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఎక్కువ సాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 జూలై నాటికి, పోలవరం ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శులు డా.జి. దశరథాచారి, గాలి చలపతి నాయుడు, మిన్నల్ రవి, యం. సుబ్బయ్య, డా.యం. ఉమేష్ రావు, వజ్రం కిషోర్, తీర్థం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

