Saturday, 12 September 2026
  • Home  
  • మాతృశ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు
- తిరుపతి

మాతృశ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు

ముఖ్యఅతిథిగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పున్నమి ప్రతినిధి, 10 మార్చి 2026 తిరుపతి శ్రీ మాతృశ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, అంకితభావం అలవరుచుకోవాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని అన్నారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు.* కేవలం చదువుకే పరిమితం కాకుండా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని, ఇది వారి మానసిక వికాసానికి తోడ్పడుతుందని సూచించారు.* విద్యా రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరిస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ముఖ్యఅతిథిగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

పున్నమి ప్రతినిధి, 10 మార్చి 2026 తిరుపతి

శ్రీ మాతృశ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, అంకితభావం అలవరుచుకోవాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని అన్నారు.
సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు.* కేవలం చదువుకే పరిమితం కాకుండా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని, ఇది వారి మానసిక వికాసానికి తోడ్పడుతుందని సూచించారు.* విద్యా రంగానికి
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరిస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.