Monday, 9 March 2026
  • Home  
  • ఆరోగ్యానికి మించిన సంపద మరొకటిలేదూ.. డివైఎస్పి నరసింహమూర్తి
- తిరుపతి

ఆరోగ్యానికి మించిన సంపద మరొకటిలేదూ.. డివైఎస్పి నరసింహమూర్తి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి పట్నంలోని పానగల్ లో జుమ్లేషా పీర్ దర్గా ఆవరణలో మహిళా దినోత్సవం, రంజన్ మాసం సందర్భంగా తిరుపతి డిఎన్ఆర్ మల్టీస్పెషాలిటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి డిఎస్పి నరసింహమూర్తి విచ్చేశారు. శ్రీకాళహస్తి డిఎస్పి మాట్లాడుతూ….. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తు ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు చెప్పిన మాటను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మనిషి జీవితంలో ధనం, ఆస్తులు ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే వాటికి విలువ ఉండదని అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. సమయానికి ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పరిశుభ్రత పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని సాధించవచ్చన్నారు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో కార్యక్రమ స్పాన్సర్ వి నాగేశ్వరరావు, డిఎన్ఆర్ హాస్పిటల్ డాక్టర్ జెనీఫర్ జనరల్ మెడిసిన్, హాస్పిటల్ పిఆర్వోలు శివశంకర్, సాయి మోహన్ రెడ్డి, యుగంధర్ బాబు, సిస్టర్లు స్వప్న, జయశ్రీ, మౌనిక, ఫార్మసిస్ట్ వెంకటేష్ మరియు దర్గా నిర్వాహకులు సయ్యద్ అహ్మద్, బాబా ఫరీద్, జమ్రుద్దీన్ , మహమ్మద్ అన్సర్, మహిళలు, పట్టణ ప్రజలు అధికంగా పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి పట్నంలోని పానగల్ లో జుమ్లేషా పీర్ దర్గా ఆవరణలో మహిళా దినోత్సవం, రంజన్ మాసం సందర్భంగా తిరుపతి డిఎన్ఆర్ మల్టీస్పెషాలిటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి డిఎస్పి నరసింహమూర్తి విచ్చేశారు. శ్రీకాళహస్తి డిఎస్పి మాట్లాడుతూ….. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తు ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు చెప్పిన మాటను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మనిషి జీవితంలో ధనం, ఆస్తులు ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే వాటికి విలువ ఉండదని అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. సమయానికి ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పరిశుభ్రత పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని సాధించవచ్చన్నారు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో కార్యక్రమ స్పాన్సర్ వి నాగేశ్వరరావు, డిఎన్ఆర్ హాస్పిటల్ డాక్టర్ జెనీఫర్ జనరల్ మెడిసిన్, హాస్పిటల్ పిఆర్వోలు శివశంకర్, సాయి మోహన్ రెడ్డి, యుగంధర్ బాబు, సిస్టర్లు స్వప్న, జయశ్రీ, మౌనిక, ఫార్మసిస్ట్ వెంకటేష్ మరియు దర్గా నిర్వాహకులు సయ్యద్ అహ్మద్, బాబా ఫరీద్, జమ్రుద్దీన్ , మహమ్మద్ అన్సర్, మహిళలు, పట్టణ ప్రజలు అధికంగా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.