వింజమూరు మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ఎంపీపీ వనిపెంట హైమావతి సారథ్యంలో వింజమూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా, సాంస్కృతిక మహోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొని 15 రకాల క్రీడల్లో ప్రతిభ కనబరిచారు. విజేతలైన 750 మందికి బహుమతులు అందజేయడం ఆనందంగా నిలిచింది. చాకలికొండ ఆర్కే ఉన్నత పాఠశాల మొదటి స్థానం, ఊటుకూరు జడ్పీ ఉన్నత పాఠశాల రెండో స్థానం, వింజమూరు జడ్పీ ఉన్నత పాఠశాల మూడో స్థానం సాధించాయి. సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ మార్గదర్శకత్వంలో విద్యారంగం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు.



