ఏర్పేడు, పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: ఏర్పేడు మండలం ఇసుక తాగేలి గ్రామంలో వికసిత్ భారత్ – జీ రామ్ జీ పథకం కింద సుమారు 46 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణంకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మంగళవారం నాడు ఈ పనులను కాంట్రాక్టర్ నూతలపాటి సూర్యనారాయణ నేతృతంలో పనులను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి సభ్యులు పేరం ధనంజయలు నాయుడు, ఏపీ సీడ్స్ మాజీ డైరెక్టర్ కందటి శివశంకర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేసి రోడ్డు పనులను ప్రారంభించారు. పూతలపట్టు – నాయుడుపేట పాత రహదారి నుంచి ఇసుక తాగేలీ వరకు ఒక కిలోమీటర్ తారు రోడ్డు, 120 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణాన్ని పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు హంస ,ముని రామయ్యలు, సర్పంచ్ కందాటి గరవమ్మ, ప్రభాకర్ రెడ్డి, మధు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలుగా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడేవారు . ప్రస్తుతం టిడిపి హయాంలో ఇసుక తాగేలికి తారు రోడ్డు సౌకర్యం ఏర్పడడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వికసిత్ భారత్ – జీ రామ్ జీ పథకంతో ఇసుక తాగేలిలో రోడ్డు సౌకర్యం
ఏర్పేడు, పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: ఏర్పేడు మండలం ఇసుక తాగేలి గ్రామంలో వికసిత్ భారత్ – జీ రామ్ జీ పథకం కింద సుమారు 46 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణంకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మంగళవారం నాడు ఈ పనులను కాంట్రాక్టర్ నూతలపాటి సూర్యనారాయణ నేతృతంలో పనులను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి సభ్యులు పేరం ధనంజయలు నాయుడు, ఏపీ సీడ్స్ మాజీ డైరెక్టర్ కందటి శివశంకర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేసి రోడ్డు పనులను ప్రారంభించారు. పూతలపట్టు – నాయుడుపేట పాత రహదారి నుంచి ఇసుక తాగేలీ వరకు ఒక కిలోమీటర్ తారు రోడ్డు, 120 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణాన్ని పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు హంస ,ముని రామయ్యలు, సర్పంచ్ కందాటి గరవమ్మ, ప్రభాకర్ రెడ్డి, మధు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలుగా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడేవారు . ప్రస్తుతం టిడిపి హయాంలో ఇసుక తాగేలికి తారు రోడ్డు సౌకర్యం ఏర్పడడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

