వరిగొండ గ్రామంలోని శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో జంగమ సేవా సంఘం ఆధ్వర్యంలో 12వ వార్షిక వనభోజన మహోత్సవం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. గోపూజ, అభిషేకం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, మెడికల్ క్యాంప్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దాతలకు సన్మానాలు, వివాహ పరిచయ వేదిక, పిల్లలకు బహుమతులు అందించారు. ఆలయ చైర్మన్ కోడూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


