శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 21:శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పవిత్రమైన సభ సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని అవమానించే విధంగా వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు నిరసనగా శనివారం ఎమ్మెల్యే నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి (కూటమి) నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీలో వైసీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం ఉరందూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే, అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ… కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి, సభ సాక్షిగా అవమానించడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనం. గత ఐదేళ్ల పాలనలో తిరుమల పవిత్రతను మంటగలిపిన వారు ఇప్పుడు కూడా తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నారు. హిందూ ధర్మంపై, భక్తుల మనోభావాలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ శ్రీవారిని కించపరిచిన వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పవిత్ర క్షేత్రాల ప్రతిష్టను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, కూటమికి చెందిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీవారికి వైసీపీ నేతల అవమానం సహించబోం-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 21:శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పవిత్రమైన సభ సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని అవమానించే విధంగా వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు నిరసనగా శనివారం ఎమ్మెల్యే నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి (కూటమి) నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీలో వైసీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం ఉరందూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే, అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ… కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి, సభ సాక్షిగా అవమానించడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనం. గత ఐదేళ్ల పాలనలో తిరుమల పవిత్రతను మంటగలిపిన వారు ఇప్పుడు కూడా తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నారు. హిందూ ధర్మంపై, భక్తుల మనోభావాలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ శ్రీవారిని కించపరిచిన వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పవిత్ర క్షేత్రాల ప్రతిష్టను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, కూటమికి చెందిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

