శ్రీకాళహస్తి ఫిబ్రవరి 20: మండలలోని చల్లపాలెం గ్రామంలో ఈ పంట నమోదు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పంట సాగు చేసిన ప్రతి రైతు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రం సిబ్బందిచే నమోదు ఈ పంట, ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరలకు విక్రయించాలంటే తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకొని, ఈ-కెవైసి ను ఈ నెల 25 వ తారీఖులోగా చేయించుకోవాలని ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎంత ప్రాముఖ్యమో అదేవిధంగా ప్రతి రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంతే ప్రాముఖ్యమైనది. త్వరలో ప్రభుత్వం నుండి రైతులకు కార్డు కూడా అందజేస్తుందని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోనని రైతులు ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులవుతారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి ప్రభుత్వ పథకాలు వర్తించవని స్పష్టంగా తెలియజేశారు. ప్రతి రైతు తమ గ్రామానికి చెందిన రైతు సేవా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సిబ్బంది వద్దకు తమ ఆధార్ కార్డు, పట్టదారు పాసు పుస్తకము తో పాటు ఆధార్ కార్డు కు అనుసంధానమైన ఫోన్ తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కు ఈ నెల 28 వ తారీఖు ఆఖరి గడువు అని తెలియజేశారు. ప్రతి రైతు తమ ఫోన్ లో ఏపీ ఏఐఎంఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. రాబోయే రోజులలో వ్యవసాయానికి సంబంధించిన ప్రతి రైతు సోమ భూమి వివరములు, ఈ పంట నమోదు వివరములు, సస్య రక్షణ, వాతావరణ సమాచారం మొదలగు అన్ని విషయాలు ఈ యాప్ నందు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ.రమేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సురేంద్ర రెడ్డి రైతు సేవా కేంద్రం సిబ్బంది భాగ్యలక్ష్మి రైతులు పార్థ సారథి రెడ్డి , గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి రైతు ఈ పంట నమోదు చేయించుకొవాలి-జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు
శ్రీకాళహస్తి ఫిబ్రవరి 20: మండలలోని చల్లపాలెం గ్రామంలో ఈ పంట నమోదు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పంట సాగు చేసిన ప్రతి రైతు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రం సిబ్బందిచే నమోదు ఈ పంట, ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరలకు విక్రయించాలంటే తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకొని, ఈ-కెవైసి ను ఈ నెల 25 వ తారీఖులోగా చేయించుకోవాలని ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎంత ప్రాముఖ్యమో అదేవిధంగా ప్రతి రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంతే ప్రాముఖ్యమైనది. త్వరలో ప్రభుత్వం నుండి రైతులకు కార్డు కూడా అందజేస్తుందని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోనని రైతులు ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులవుతారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి ప్రభుత్వ పథకాలు వర్తించవని స్పష్టంగా తెలియజేశారు. ప్రతి రైతు తమ గ్రామానికి చెందిన రైతు సేవా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సిబ్బంది వద్దకు తమ ఆధార్ కార్డు, పట్టదారు పాసు పుస్తకము తో పాటు ఆధార్ కార్డు కు అనుసంధానమైన ఫోన్ తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కు ఈ నెల 28 వ తారీఖు ఆఖరి గడువు అని తెలియజేశారు. ప్రతి రైతు తమ ఫోన్ లో ఏపీ ఏఐఎంఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. రాబోయే రోజులలో వ్యవసాయానికి సంబంధించిన ప్రతి రైతు సోమ భూమి వివరములు, ఈ పంట నమోదు వివరములు, సస్య రక్షణ, వాతావరణ సమాచారం మొదలగు అన్ని విషయాలు ఈ యాప్ నందు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ.రమేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సురేంద్ర రెడ్డి రైతు సేవా కేంద్రం సిబ్బంది భాగ్యలక్ష్మి రైతులు పార్థ సారథి రెడ్డి , గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

