Monday, 16 February 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో సేవా ప్రవాహం-రథోత్సవంలో మజ్జిగ పంపిణీ
- తిరుపతి

శ్రీకాళహస్తిలో సేవా ప్రవాహం-రథోత్సవంలో మజ్జిగ పంపిణీ

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం నాడు నిర్వహించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనానికి ఎండ వేడి నుండి ఉపశమనం కలిగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు భారీ స్థాయిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా బీసీ సెల్ కార్యదర్శి, బి.ఎమ్.ఆర్ సైనికుడు జి. విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రథోత్సవ మార్గంలో భక్తులకు చల్లని మజ్జిగను పంపిణీ నిర్వహించి భక్తుల దాహార్తిని తీర్చరు. స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఈ సేవ ఎంతగానో ఉపయోగపడింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎప్పుడూ ప్రజల సేవలో ఉండాలని మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారని మహాశివరాత్రి పుణ్యదినాన స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సేవ చేయడం తమా అదృష్టంగా భావిస్తున్నామనీ పేర్కొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్రమపద్ధతిలో మజ్జిగ పంపిణీ సాగింది. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బి.ఎమ్.ఆర్ సేవా దళం సభ్యులు పాల్గొని భక్తులకు సేవలందించారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం నాడు నిర్వహించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనానికి ఎండ వేడి నుండి ఉపశమనం కలిగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు భారీ స్థాయిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా బీసీ సెల్ కార్యదర్శి, బి.ఎమ్.ఆర్ సైనికుడు జి. విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రథోత్సవ మార్గంలో భక్తులకు చల్లని మజ్జిగను పంపిణీ నిర్వహించి భక్తుల దాహార్తిని తీర్చరు. స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఈ సేవ ఎంతగానో ఉపయోగపడింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎప్పుడూ ప్రజల సేవలో ఉండాలని మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారని మహాశివరాత్రి పుణ్యదినాన స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సేవ చేయడం తమా అదృష్టంగా భావిస్తున్నామనీ పేర్కొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్రమపద్ధతిలో మజ్జిగ పంపిణీ సాగింది. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బి.ఎమ్.ఆర్ సేవా దళం సభ్యులు పాల్గొని భక్తులకు సేవలందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.