Monday, 16 February 2026
  • Home  
  • నందిపై శివుని దివ్యతేజం: కైలాసనాథుని వాహన సేవతో పులకించిన పురవీధులు
- తిరుపతి

నందిపై శివుని దివ్యతేజం: కైలాసనాథుని వాహన సేవతో పులకించిన పురవీధులు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. పరమశివుని దర్శనార్థం తరలివచ్చిన భక్తకోటితో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఆదివారం నాడు రాత్రి మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా అత్యంత ప్రధానమైన నంది వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. నందీశ్వరునిపైగంగాధరుడు..సింహవాహనంపైజ్ఞానాంబ జాగారం చేసే భక్తులను అనుగ్రహించేందుకు, భక్తవత్సలుడైన సోమస్కందమూర్తి గంగాదేవి సమేతుడై అధికార నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు గంభీరమైన సింహవాహనంపై ఆసీనులై స్వామివారితో కలిసి పురవీధుల్లో విహరించారు. విద్యుత్ దీపకాంతులు, మంగళ వాయిద్యాలు, భక్తుల ‘నమశ్శివాయ’ స్మరణల మధ్య వాహన సేవ అట్టహాసంగా సాగింది. భక్తిసాగరమైనపురవీధులు మహాశివరాత్రి నాటి ప్రత్యేక జాగరణలో ఉన్న వేలాది మంది భక్తులు స్వామివారి దివ్యతేజాన్ని దర్శించుకుని తరించారు. నందీశ్వరునిపై కొలువుదీరిన శివుని రూపం భక్తులకు కనువిందు చేసింది. కైలాసమే భూమికి దిగివచ్చిందా అన్నట్లుగా సాగిన ఈ ఊరేగింపులో కోలాటాలు, భజన బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు పురవీధుల్లో భక్తులు బారులు తీరారు. అధికారుల పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. పరమశివుని దర్శనార్థం తరలివచ్చిన భక్తకోటితో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఆదివారం నాడు రాత్రి మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా అత్యంత ప్రధానమైన నంది వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది.
నందీశ్వరునిపైగంగాధరుడు..సింహవాహనంపైజ్ఞానాంబ
జాగారం చేసే భక్తులను అనుగ్రహించేందుకు, భక్తవత్సలుడైన సోమస్కందమూర్తి గంగాదేవి సమేతుడై అధికార నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు గంభీరమైన సింహవాహనంపై ఆసీనులై స్వామివారితో కలిసి పురవీధుల్లో విహరించారు. విద్యుత్ దీపకాంతులు, మంగళ వాయిద్యాలు, భక్తుల ‘నమశ్శివాయ’ స్మరణల మధ్య వాహన సేవ అట్టహాసంగా సాగింది.
భక్తిసాగరమైనపురవీధులు
మహాశివరాత్రి నాటి ప్రత్యేక జాగరణలో ఉన్న వేలాది మంది భక్తులు స్వామివారి దివ్యతేజాన్ని దర్శించుకుని తరించారు. నందీశ్వరునిపై కొలువుదీరిన శివుని రూపం భక్తులకు కనువిందు చేసింది. కైలాసమే భూమికి దిగివచ్చిందా అన్నట్లుగా సాగిన ఈ ఊరేగింపులో కోలాటాలు, భజన బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు పురవీధుల్లో భక్తులు బారులు తీరారు. అధికారుల పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.