ఖమ్మం జనవరి
(పున్నమి దిన పత్రిక జిల్లా స్టాఫర్)
నేటి నుంచి జనవరి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు.
ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 12న ఉప ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపడతామని స్పష్టం చేశారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు.



