శ్రీ కాళహస్తి, జులై 02 : (పున్నమి న్యూస్) : జనసేన పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి రాబోయే రోజుల్లో గొప్ప అవకాశాలు లభిస్తాయని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, జనసేన పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి కొట్టేసాయి ప్రసాద్ పేర్కొన్నారు. తన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ….గత 12 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని, అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి జనసైనికుడి సేవలను పార్టీ గుర్తించిందని చెప్పారు. కార్యకర్తలు తామే స్వయంగా ఏ బాధ్యత కావాలో కోరికోవాలని పదవి పొందిన వారు ఎంత సమర్థవంతంగా పనిచేయగలరో స్వయంగా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుంటున్నారని, అందుకోసం వచ్చే అప్లికేషన్లను ఒక ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలింపజేసి తగిన పదవులు కల్పిస్తున్నారని ఆయన వెల్లడించారు. అధినేత కల్పిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి జనసైనికుడు సద్వినియోగం చేసుకుని, పార్టీ బలోపేతానికి మరింత కట్టుబడి పనిచేయాలని కొట్టే సాయి పిలుపునిచ్చారు.

జన సైనికులకు పవన్ కళ్యాణ్ పెద్దపీట- కొట్టేసాయి ప్రసాద్
శ్రీ కాళహస్తి, జులై 02 : (పున్నమి న్యూస్) : జనసేన పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి రాబోయే రోజుల్లో గొప్ప అవకాశాలు లభిస్తాయని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, జనసేన పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి కొట్టేసాయి ప్రసాద్ పేర్కొన్నారు. తన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ….గత 12 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని, అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి జనసైనికుడి సేవలను పార్టీ గుర్తించిందని చెప్పారు. కార్యకర్తలు తామే స్వయంగా ఏ బాధ్యత కావాలో కోరికోవాలని పదవి పొందిన వారు ఎంత సమర్థవంతంగా పనిచేయగలరో స్వయంగా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుంటున్నారని, అందుకోసం వచ్చే అప్లికేషన్లను ఒక ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలింపజేసి తగిన పదవులు కల్పిస్తున్నారని ఆయన వెల్లడించారు. అధినేత కల్పిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి జనసైనికుడు సద్వినియోగం చేసుకుని, పార్టీ బలోపేతానికి మరింత కట్టుబడి పనిచేయాలని కొట్టే సాయి పిలుపునిచ్చారు.

