శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ ఎన్ జి జి ఓ సంఘం అధ్యక్షులు ఏ విద్య సాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణని శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా ఏపీ ఎన్ జి జి వో సంఘం నాయకులు కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని 2003 వ సంవత్సరంలో కాంటాక్ట్ బేసిస్ మీద పంచాయతీ కార్యదర్శులుగా నియమింపబడి, రెగ్యులరైజ్ అయినటువంటి వారిని 2017 సంవత్సరం కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ప్రకారం సిపిఎస్ నుండి ఓ పి ఎస్ కు మార్చాలని వినతి పత్రాన్ని సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి అధ్యక్షులు చెంచురత్నం యాదవ్, తిరుపతి జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్ బాబు, శ్రీకాళహస్తి ఆర్గనైజ్ సెక్రెటరీ వెంకట ముని, జాయింట్ సెక్రటరీ గోవిందస్వామి, రాయలసీమ పంచాయతీరాజ్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ బాబులు పాల్గొన్నారు.
Uploaded Video:


