కలెక్టరేట్ లో జరుగుతున్న రెవెన్యూ క్లినిక్ లో పాల్గొని తహసీల్దార్ లకు ఆదేశాలు, సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్,
*విశాఖపట్నం డిసెంబర్ 5పున్నమి ప్రతినిధి *
భూములకు సంబంధించి రెవెన్యూ క్లినిక్ లకు వస్తున్న సమస్యలను వీలైనంతవరకు రెవెన్యూ క్లినిక్ లలో
పరిష్కరించండి.
కార్యాలయాల చుట్టూ తిప్పు కోవద్దు. పరిష్కారం లో జాప్యం
చేయ వద్దు.
భూ సమస్యల పరిష్కారంలో దళారులు,రాజకీయ నాయకులు చెప్పిన వారి నుండే అర్జీలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని,
భూసమస్యల
పరిష్కారం లో దళారుల ప్రమేయం సహించేది లేదని రెవెన్యూ అధికారులను హెచ్చరించారు.
దళారులను, రాజకీయ నాయకులు చెబితేనే రిజిస్టర్ చేస్తామని రెవెన్యూ అధికారులు గాని, సిబ్బంది గానీ చెబితే సస్పెండ్ చేస్తామన్నారు.
డిజిటల్ అసిస్టెంట్ లు డాక్యుమెంట్స్ లేవని అర్జీలు నిరాకరించ వద్దని, సర్వే నెంబర్ ఉన్నా స్వీకరించి రిజిస్టర్ చేయాలన్నారు.
భూసమస్యలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
రెవెన్యూ క్లినిక్ లలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పాల్గొని అర్జీలు స్వీకరించారు.
రెవెన్యూ క్లినిక్ లలో RDO లు, తహసీల్దార్ లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


