శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 02: పట్టణంలోని కైలాసగిరి కాలనీలో ఉన్న మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధిపనులపై శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశంపార్టీ మహిళా అధ్యక్షురాలు అల్లం సుమతి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేకుండా పాఠశాల దుస్థితిలో కొనసాగిందన్నారు. అప్పుడు “నాడు–నేడు” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా, ఆ పథకం ఈ పాఠశాలకు మాత్రం కాగితాలకే పరిమితమైందని వైసీపీ ప్రభుత్వపాలనలో పాఠశాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారని ఆ నిధులను పక్కదారి మళ్లించి వాటిని సరైన విధంగా వినియోగించకపోవడం, పనులను మధ్యలోనే ఆపేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆ సమయంలో పాఠశాలలో కేవలం 65 మంది విద్యార్థులే ఉండగా, తగిన మౌలిక వసతుల లేమి కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పాఠశాలలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిందని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించి, పాఠశాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన బాత్రూమ్స్, తాగునీరు, అధ్వానంగా ఉన్న పాఠశాల ముందర భాగంలో గ్రావెల్ మట్టితో సుందరంగా తీర్చిదిద్ది రోడ్డు వసతి కల్పించారు ఇతర మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టారని ఈ క్రమంలో సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసి, పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాల అభివృద్ధికి కృషి చేయడంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య వందకు (100) పైగా పెరిగిందని ఇది ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోందన్నారు. ఇప్పుడు పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక, వైసీపీ నాయకులు నిందలు వేస్తూ పనులకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని గతంలో తామే ఆపేసిన పనులపై నోరు విప్పని వైసీపీ, ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కైలాసగిరి మునిసిపల్ ప్రాథమిక పాఠశాల విషయంలో గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుండగా, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం వెనుక రాజకీయ స్వార్థమేనని ఆమె పేర్కొన్నారు.

అభివృద్ధిని అడ్డుకోవడమే వైసిపి నైజం… టి.డి.పి. పట్టణ మహిళా అధ్యక్షురాలు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 02: పట్టణంలోని కైలాసగిరి కాలనీలో ఉన్న మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధిపనులపై శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశంపార్టీ మహిళా అధ్యక్షురాలు అల్లం సుమతి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేకుండా పాఠశాల దుస్థితిలో కొనసాగిందన్నారు. అప్పుడు “నాడు–నేడు” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా, ఆ పథకం ఈ పాఠశాలకు మాత్రం కాగితాలకే పరిమితమైందని వైసీపీ ప్రభుత్వపాలనలో పాఠశాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారని ఆ నిధులను పక్కదారి మళ్లించి వాటిని సరైన విధంగా వినియోగించకపోవడం, పనులను మధ్యలోనే ఆపేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆ సమయంలో పాఠశాలలో కేవలం 65 మంది విద్యార్థులే ఉండగా, తగిన మౌలిక వసతుల లేమి కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పాఠశాలలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిందని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించి, పాఠశాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన బాత్రూమ్స్, తాగునీరు, అధ్వానంగా ఉన్న పాఠశాల ముందర భాగంలో గ్రావెల్ మట్టితో సుందరంగా తీర్చిదిద్ది రోడ్డు వసతి కల్పించారు ఇతర మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టారని ఈ క్రమంలో సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసి, పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాల అభివృద్ధికి కృషి చేయడంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య వందకు (100) పైగా పెరిగిందని ఇది ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోందన్నారు. ఇప్పుడు పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక, వైసీపీ నాయకులు నిందలు వేస్తూ పనులకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని గతంలో తామే ఆపేసిన పనులపై నోరు విప్పని వైసీపీ, ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కైలాసగిరి మునిసిపల్ ప్రాథమిక పాఠశాల విషయంలో గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుండగా, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం వెనుక రాజకీయ స్వార్థమేనని ఆమె పేర్కొన్నారు.

