— పున్నమి ప్రతినిధి
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విదేశాంగ విధానంలో కీలక మార్పులు చేపట్టినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో వివిధ దేశాల్లో అమెరికాను ప్రాతినిధ్యం వహిస్తున్న 30 మంది రాయబారులను ఒక్కసారిగా తొలగిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో నియమితులైనవారేనని సమాచారం. “అమెరికా ఫస్ట్” ఎజెండాను కట్టుదిట్టంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


