నమో నరసింహ!
వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం – సింహాచలం
ప్రభుత్వ విప్ సింహాచలం స్వామివారి దర్శనం
విశాఖపట్నం డిసెంబర్ 6పున్నమి ప్రతినిధి:-
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, సింహాచలం క్షేత్రాన్ని శనివారం ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సింహగిరిపై కొలువైన స్వామివారిని దర్శించుకున్నారు.
దంపతులకు దేవస్థానం అధికారులు ఆలయ సంప్రదాయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఆలయ పర్యవేక్షణ అధికారి శ్రీ కె.వి.వి.ఎస్.ఎన్. మూర్తి, మరియు ప్రోటోకాల్ సహాయకులు సూర్యనారాయణ దంపతులకు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ముందుగా ఆలయ మహాద్భుతమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం, వారు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనం అనంతరం, ఆలయ వేదపండితులు వారికి మంత్రోచ్ఛారణలతో వేద ఆశీర్వచనాలను అందించారు. పర్యవేక్షణ అధికారి కె.వి.వి.ఎస్.ఎన్. మూర్తి శ్రీ స్వామివారి పటం మరియు పవిత్రమైన ప్రసాదాలను అందజేశారు.


