రంగారెడ్డి జిల్లా: కర్మంఘాట్ పోచమ్మ దేవాలయం నందు , పోచమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా ఆదివారం రోజు నిర్వహించడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మాధవ నగర్ కాలనీవాసులు, కర్మన్ఘట్ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో, ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అదేవిధంగా భక్తులు అందరూ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి, మేళ తాళాలతో, పోతురాజులతో విన్యాసాలతో, శివసత్తుల నాట్యాలతో, అధిక సంఖ్యలో వచ్చి బోనాల సమర్పించి, వారు మొక్కులను చెల్లించుకొని,పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ముందుకు సాగారు. ఊరంత చల్లగా, పాడి పంటలు బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పోచమ్మ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాధవ నగర్ కాలనీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ దర్శించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎరుకల విశ్వనాథ్ గౌడ్, చేగోని మల్లేష్ గౌడ్, జగదీష్ గౌడ్, జై ప్రసాద్ రెడ్డి, పాలెం శ్రీకాంత్, ఓం ప్రకాష్, లోతుకుంట రఘు గౌడ్, చిన్న మధు రాయిని రాజు వారు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





