-ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ నుండి ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్’ అవార్డు – మంత్రి సత్య కుమార్ చేతుల మీదుగా డాక్టర్ ప్రేమలతకు ప్రదానం
చిట్వేల్, డిసెంబర్ 3: పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.
-విజయవాడలో అవార్డు ప్రదానం
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం చేతుల మీదుగా కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఇ. ప్రేమలత అవార్డును స్వీకరించారు.లెర్నింగ్ మాడ్యూల్ పై బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఐఈసీ యాక్టింగ్’ క్రింద ఈ అవార్డు కళాశాలకు దక్కింది.
-ప్రిన్సిపాల్ హర్షం
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, తమ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావడానికి నిరంతరం కృషి చేసిన కో-ఆర్డినేటర్ డాక్టర్ ఇ. ప్రేమలత గారిని, ఆమె కష్టపడి ప్రతి కార్యక్రమం నిర్వహించడం వల్లే ఈ గుర్తింపు వచ్చిందని కొనియాడారు. ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు సైతం డాక్టర్ ప్రేమలతను అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి దాసరి మోషే, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, కెమిస్ట్రీ లెక్చరర్ కె.పి. కృష్ణమూర్తి, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


