ఉక్కు కార్మికుల సమస్యలను పరిష్కరించండి .
__ ఇంటక్ విజ్ఞప్తి .
విశాఖ ఉక్కు కర్మాగారం లో కార్మికులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్టీల్ ఇంటక్ ఉక్కు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ప్లాంట్ జనరల్ మేనేజర్ ( హెచ్.ఆర్) ఎన్. బాను కు ఇంటక్ ప్రతినిధి వర్గం వినతి పత్రం అందజేసింది . ఈ సందర్భంగా ఇంటక్ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజ శేఖర్ , స్టీల్ ఇంటక్ అధ్యక్షులు పి.వి.రమణ మూర్తి మాట్లాడుతూ ఉక్కు యాజమాన్యం నిర్దేశించిన మేరకు ఉక్కు ఉత్పత్తి, ఉత్పాదకల్లో భాగస్వాములై కృషి చేస్తున్నారని అన్నారు. ఉక్కులో మ్యాన్ పవర్ కొరత తీవ్రంగా ఉందని , తద్వారా ఉక్కు ఉద్యోగులపై పని బారం పెరిగిందని అన్నారు . తక్షణమే మ్యాన్ పవర్ పెంచాలని , మ్యాన్ పవర్ తక్కువగా ఉండటం వల్ల కార్మికులు సెలవులు వాడటం లేదని అన్నారు. ఈ సమస్య వల్ల ఈ ఎల్స్ వాడటం లేదని అన్నారు. ఈ ఎల్ ఎన్క్యాష్మెంట్ కు అవకాశం ఇస్తే ఉద్యోగుల పిల్లలకు స్కూల్ ఫీజు లు , ఇతర అవసరాలకు ఉపయోగ పడతాయని అన్నారు .ఈ ఎల్స్ అధికారులకు మాదిరిగా 200 లీవ్స్ నుండి 300 లీవ్స్ ఇచ్చినట్లయితే కార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఇంటక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము ప్రసాద్ , సీనియర్ నాయకులు నడుపూరు వెంకన్న ,కోరిబిల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


