విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి )ఆగస్టు 16::
విశాఖపట్నం నగరంలో 3వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్–2026 నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 22, 23 తేదీల్లో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఈ ప్రతిష్ఠాత్మక కరాటే పోటీలు జరగనున్నాయి.
డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్షిప్కు కరాటే ఇండియా, స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విక్టరీ షోటోకాన్ కరాటే డూ అసోసియేషన్–ఇండియా తదితర సంస్థల సహకారం అందిస్తున్నాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కరాటే క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్న నేపథ్యంలో విజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు పోటీల అనంతరం బహుమతులు, ప్రశంసలు అందించనున్నారు.
కరాటే ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


