భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తుడా ఛైర్మన్, తితిదే ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
* *అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,“భారత మహిళా క్రికెట్ జట్టు ఈ రోజు దక్షిణాఫ్రికాతో ఫైనల్ పోటీలో తలపడుతోంది.ఈ స్థాయికి చేరుకోవడం జట్టు కృషి, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. మ్యాచ్ ఫలితమేమైనా, వారి ప్రదర్శన భారత క్రీడా చరిత్రలో గర్వకారణం అవుతుంది,” అని తెలిపారు.*
* *యువత క్రీడలవైపు మరింత ఆకర్షితులు కావాలని, మహిళలు ప్రతి రంగంలో ప్రతిభ చాటుతున్నారని ఆయన అన్నారు. భారత జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.*
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ
సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

