శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తుఫాన్ కారణంగా కూలిన ఇండ్లుకు నష్టపరిహారం అందిందా, రెవెన్యూ శాఖ అధికారులు సకాలంలో స్పందించారా లేద అని తెలుసుకోవాలని తమ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిశ నిర్దేశం చేశారు. అందులో భాగంగా గురువారం నాడు టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శిభారీ కాసరం రమేష్, తే.దే.పా నాయకులు కార్యకర్తలతో కలసి వర్షాల కారణంగా నష్టపోయి నిర్వాసితుల ఇళ్ల వద్దకు వెళ్ళి వారికి ప్రభుత్వం అధికారులు సకాలంలో స్పందించారా అని అడిగి తెలుసుకోవడం జరిగిందని అనంతరం రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి కూలిపోయిన ఇండ్లకు త్వరతిగతిగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందేలా చేయాలని వారికి తెలిపారు. అదేవిధంగా అక్కడున్నటువంటి నిర్వాసితుల సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చినటువంటి అంశంలలో ఒకటైన కోర్టు ప్రహరీ గోడ మొత్తం కూలి పోయే దుస్థితిలో ఉందని, వృద్దులు, చంటిబిడ్డలు, పాదాచారులు, ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు కనుక రాబోవు రోజులలో ఎలాంటి అసందర్భం జరగకుండా ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం కలగకుండా ఉండే విధంగా ఎమ్మెల్యే చొరవ చూపి చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు తె.దే.పా నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగిందని తే.దే.పా నాయకులు, కార్యకర్తలు శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి విపులంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బాలు ఢిల్లీ, రాకేష్, నవీన్, వివేక్, తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు.

తుఫాన్ బాధితుల నష్టపరిహారంపై పార్టీ నాయకులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిశ నిర్దేశం
శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తుఫాన్ కారణంగా కూలిన ఇండ్లుకు నష్టపరిహారం అందిందా, రెవెన్యూ శాఖ అధికారులు సకాలంలో స్పందించారా లేద అని తెలుసుకోవాలని తమ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిశ నిర్దేశం చేశారు. అందులో భాగంగా గురువారం నాడు టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శిభారీ కాసరం రమేష్, తే.దే.పా నాయకులు కార్యకర్తలతో కలసి వర్షాల కారణంగా నష్టపోయి నిర్వాసితుల ఇళ్ల వద్దకు వెళ్ళి వారికి ప్రభుత్వం అధికారులు సకాలంలో స్పందించారా అని అడిగి తెలుసుకోవడం జరిగిందని అనంతరం రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి కూలిపోయిన ఇండ్లకు త్వరతిగతిగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందేలా చేయాలని వారికి తెలిపారు. అదేవిధంగా అక్కడున్నటువంటి నిర్వాసితుల సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చినటువంటి అంశంలలో ఒకటైన కోర్టు ప్రహరీ గోడ మొత్తం కూలి పోయే దుస్థితిలో ఉందని, వృద్దులు, చంటిబిడ్డలు, పాదాచారులు, ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు కనుక రాబోవు రోజులలో ఎలాంటి అసందర్భం జరగకుండా ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం కలగకుండా ఉండే విధంగా ఎమ్మెల్యే చొరవ చూపి చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు తె.దే.పా నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగిందని తే.దే.పా నాయకులు, కార్యకర్తలు శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి విపులంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బాలు ఢిల్లీ, రాకేష్, నవీన్, వివేక్, తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు.

