రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు లోని పురాతన శ్రీ భువనేశ్వరీ దేవి సమేత శ్రీ భుజంగేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ శ్ఉంగరాల సురేంద్ర కుమార్ మరియు పాలకవర్గం , సిబ్బంది, అర్చకులు పవన్ స్వామి ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలు రంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మొదటి కార్తీక సోమవారం శుభ సందర్భంగా భక్తులు శ్రీ స్వామి అమ్మవార్లను విశేషంగా దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించి , తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.


