సింగం కృష్ణ, భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్, మునుగోడు ప్రతినిధి,అక్టోబర్24,(పున్నమి ప్రతినిధి):
ఎంబిబిఎస్ లో ర్యాంకు సాధించి పై చదువులకు పేదరికం వల్ల ఆటంకం ఏర్పడిన చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన ఎర్ర మధుశ్రీ,కి 50,000 యాభై వేల రూపాయలు,మర్రిగూడం మండల కేంద్రానికి చెందిన ఈద గిరి,కి 50,000 వేల రూపాయలు,కొండ మల్లేపల్లి మండలం ఎస్సి కాలనీ కి చెందిన అందుగుల తేజశ్రీ,అందుగుల ప్రవల్లిక,ల కు 50,000 వేల రూపాయలు ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్,భాస్కర్ సూచన మేరకు డైరెక్టర్ అశోక్,చేతులమీదుగా మొత్తం 1,50,000 లక్షా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందించారు.మునుముందు వారి ఎంబిబిఎస్ చదువుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మాట ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్తులు,అభిమానులు, తదితరులు,పాల్గొన్నారు.


