నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానాన్ని సందర్శించనున్నా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి పర్యటన
ఈనెల 22వ తేదీన ఉదయగిరి నియోజకవర్గంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటిస్తారని I&PR కార్యాలయం సోమవారం తెలిపింది. ఉదయం 11:30 గంటలకు వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం ప్రజలతో సమావేశమవుతారు. ఆ తర్వాత దుత్తలూరు మండలం నర్రవాడలో శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానాన్ని సందర్శించనున్నారు.


