అమరావతి అక్టోబర్ పున్నమి ప్రతినిధి (విశాఖపట్నం )
రేపటి నుంచి 3 రోజుల పాటు యూఏఈ (UAE)లో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
• రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం యూఏఈ లో ముఖ్యమంత్రి బృందం పర్యటన
• వచ్చే నెల 14-15వ తేదీల్లో విశాఖలో జరగనున్న పార్టనర్షిప్ సమ్మిట్ కు వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్న చంద్రబాబు
• మూడు రోజుల పర్యటన కోసం రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లనున్న సిఎం చంద్రబాబు
• 3 రోజుల్లో వివిధ అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో ఒన్ టూ ఒన్ మీటింగులకు హజరు కానున్న ముఖ్యమంత్రి
• పారిశ్రామికవేత్తలతో పాటు యూఏఈకి చెందిన ప్రభుత్వ ప్రతినిధులతోను భేటీలు
• రేపు దుబాయ్ లో సిఐఐ రోడ్ షో కార్యక్రమంలో పాల్గొననున్న సిఎం చంద్రబాబు
• దుబాయ్ లో మూడవ రోజు AP NRT ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొననున్న సిఎం చంద్రబాబు
• తొలి రోజు పర్యటనలో భాగంగా 22వ తేదీ ఐదు కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ.
• శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో రేపు సీఎం చంద్రబాబు సమావేశం.
• ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్టులు-షిప్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించనున్న చంద్రబాబు.
• పర్యటనలో పలు ప్రాంతాలను సందర్శించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం
• చంద్రబాబుతో పాటు దుబాయ్ పర్యటనలో పాల్గొననున్న మంత్రులు టిజి భరత్, బిసి జనార్థన్ రెడ్డి, సిఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఎపి ఇడిబి సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రి రెడ్డి.
• నవంబర్ లో నిర్వహించే విశాఖ పార్టనర్షిప్ సమ్మిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం
• పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునేందుకు ఇప్పటికే సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సిఎం చంద్రబాబు, నారా లోకేష్ రోడ్ షోలు.

