డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, మామిడికుదురు మండలంలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతు సాధికార సమస్థ (Rythu Sadhikara Samastha – APRySS) మరియు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (APCNF) సంయుక్తంగా సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ పర్యావరణానికి అనుకూలంగా, మానవ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార ఉత్పత్తులపై దృష్టి సారించాయి. రసాయన రహితంగా, నేల సారాన్ని కాపాడుతూ, పర్యావరణ స్నేహపూర్వక పద్ధతుల్లో పండించే పంటలు రైతులకు ఆర్థిక లాభాలను, వినియోగదారులకు ఆరోగ్యకర ఆహారాన్ని అందిస్తున్నాయి.
డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రైతులు ఈ సహజ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పండ్లు, ధాన్యాలను నేరుగా ప్రజలకు అందించేందుకు “రైతు మండి నుండి వినియోగదారుల దాకా” అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రైతులు స్వయంగా ఉత్పత్తులను మార్కెట్కి తీసుకెళ్లడం ద్వారా మధ్యవర్తులను తొలగించి, న్యాయమైన ధరను పొందుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు సహజ ఆహారాన్ని తినడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని అవగాహన పెంచుతున్నారు.
ఈ కార్యక్రమం K. జానకి, Ch. రాధ, మరియు G. లెనిన్ ఆధ్వర్యంలో జరుగుతూ సహజ వ్యవసాయ విప్లవానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇది పచ్చని భవిష్యత్తు వైపు రైతుల సంకల్పానికి ప్రతీకగా నిలుస్తోంది.


