నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల ద్వారా ఇంకా మెరుగైన విద్యను అందించాల్సిన బాధ్యత కేజీబీవీల ప్రత్యేక అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కేజీబీవీ లపై మండల ప్రత్యేక అధికారులు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు.
జిల్లాలో 27 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో సుమారు 1335 లక్షలతో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశానికి అదనపు కలెక్టర్లు నారాయన్ అమిత్, జె. శ్రీనివాస్, డీఈవో బిక్షపతి, మండల ప్రత్యేక అధికారులు హాజరయ్యారు.

మెరుగైన విద్యను అందించాల్సిన బాధ్యత కేజీబీవీ ల ప్రత్యేక అధికారులపై ఉందన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల ద్వారా ఇంకా మెరుగైన విద్యను అందించాల్సిన బాధ్యత కేజీబీవీల ప్రత్యేక అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కేజీబీవీ లపై మండల ప్రత్యేక అధికారులు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 27 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో సుమారు 1335 లక్షలతో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్లు నారాయన్ అమిత్, జె. శ్రీనివాస్, డీఈవో బిక్షపతి, మండల ప్రత్యేక అధికారులు హాజరయ్యారు.

