రాజమహేంద్రవరం :
మానవత్వం మాత్రమే కాదు సమితి ముఖ్య ఉద్దేశ్యం పూర్తి చేసాము. కర్తవ్య నిర్వహణలో ‘ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి’ సైనికులు సాయికృష్ణ, మీనాక్షి రెడ్డి. వివరాల్లోకి వెళితే స్థానిక రాజమహేంద్రవరం క్వారీ రోడ్ నుండి లాలాచెర్వు వెళ్లే దారిలో వున్న చిన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద ఒక గోవు గాయాలతో కొట్టుమిట్టడుతున్నట్టు సమాచారం సమితి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రవికుమార్ కు తెలియడంతో కార్యాచరణ మొదలుపెట్టారు. గోవుల పరిరక్షణ కు ముందుండే సమితి సభ్యులు హుటాహుటిన అక్కడకు బయలుదేరి వెళ్లారు. గోవు పరిస్థితిని చూసి విజయవాడ కు చెందిన పశు సంరక్షణ శాఖకు సమాచారం అందించడం తో సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి రాజమహేంద్రవరం శాఖకు సమాచారం అందించడంతో వెంటనే అంబులెన్సుతో సంఘటన స్థలానికి చేరుకొని లేగ దూడను పరీక్షించి తగిన చికిత్స చెయడం తో పాటు గోవును ఆసుపత్రి కీ తరలించి సెలైన్ ఎక్కించి మరింత మెరుగైన చికిత్స అందించి గాయలకు కట్లు కట్టి తిరిగి తల్లి ఆవు దగ్గర విడిచి పెట్టారు. ప్రస్తుతానికి దూడ పరిస్థితి మెరుగ్గా వుంది. దూడను ఆసుపత్రి కీ తరలించే క్రమంలో అంబులెన్సు కు అడ్డుగా నిలబడి తల్లి ఆవు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తల్లి ప్రేమ ను చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యనికి అవధులు లేవు. ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించిన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి చెందిన ప్రతి సభ్యునికి స్థానికి ప్రజలు కృతజ్ఞతలు తెలియచేశారు. సమితి సభ్యులకు జిల్లా అధ్యక్షులు రవికుమార్ ప్రత్యేక అభినందనలు తెలియ చేశారు.

గాయపడిన గోవును కాపాడిన – హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి.
రాజమహేంద్రవరం : మానవత్వం మాత్రమే కాదు సమితి ముఖ్య ఉద్దేశ్యం పూర్తి చేసాము. కర్తవ్య నిర్వహణలో ‘ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి’ సైనికులు సాయికృష్ణ, మీనాక్షి రెడ్డి. వివరాల్లోకి వెళితే స్థానిక రాజమహేంద్రవరం క్వారీ రోడ్ నుండి లాలాచెర్వు వెళ్లే దారిలో వున్న చిన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద ఒక గోవు గాయాలతో కొట్టుమిట్టడుతున్నట్టు సమాచారం సమితి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రవికుమార్ కు తెలియడంతో కార్యాచరణ మొదలుపెట్టారు. గోవుల పరిరక్షణ కు ముందుండే సమితి సభ్యులు హుటాహుటిన అక్కడకు బయలుదేరి వెళ్లారు. గోవు పరిస్థితిని చూసి విజయవాడ కు చెందిన పశు సంరక్షణ శాఖకు సమాచారం అందించడం తో సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి రాజమహేంద్రవరం శాఖకు సమాచారం అందించడంతో వెంటనే అంబులెన్సుతో సంఘటన స్థలానికి చేరుకొని లేగ దూడను పరీక్షించి తగిన చికిత్స చెయడం తో పాటు గోవును ఆసుపత్రి కీ తరలించి సెలైన్ ఎక్కించి మరింత మెరుగైన చికిత్స అందించి గాయలకు కట్లు కట్టి తిరిగి తల్లి ఆవు దగ్గర విడిచి పెట్టారు. ప్రస్తుతానికి దూడ పరిస్థితి మెరుగ్గా వుంది. దూడను ఆసుపత్రి కీ తరలించే క్రమంలో అంబులెన్సు కు అడ్డుగా నిలబడి తల్లి ఆవు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తల్లి ప్రేమ ను చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యనికి అవధులు లేవు. ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించిన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి చెందిన ప్రతి సభ్యునికి స్థానికి ప్రజలు కృతజ్ఞతలు తెలియచేశారు. సమితి సభ్యులకు జిల్లా అధ్యక్షులు రవికుమార్ ప్రత్యేక అభినందనలు తెలియ చేశారు.

