అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలం ఎన్.వి కండ్రిక హైస్కూల్ నందు జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో భాగంగా పిల్లందరికి బాల్య వివాహం వల్ల వచ్చే నష్టాలు మరియు హెల్ప్ లైన్ నెంబర్లు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఎమ్ పద్మ మాట్లాడుతూ సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం జరుపుకుంటారని ఆమె తెలిపారు. బాలిక శిశువు గురించి అసమానత్వం విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహంల గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు.సమాజంలో మహిళల హోదాను ప్రోత్సహించటానికి అమ్మాయిలు సాధారణంగా వారి జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ రకాల సాంఘిక వివక్ష, దోపిడీని తొలగించడం చాలా అవసరమని, సమాజంలో మహిళల అవసరం గురించి అవగాహన పెంచడానికి, వివిధ రాజకీయ, కమ్యూనిటీ నాయకులు సమాన విద్య, ప్రాథమిక స్వేచ్ఛ కోసం అమ్మాయిలు గురించి ప్రజలకు చెప్పడం జరుగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు స్కూలు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


