సిద్ధవటం మండలంలోని మాధవరం-1 గ్రామ పంచాయతీ మహబూబ్ నగర్ గ్రామంలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్లు సిద్దవటం ఎస్సై మహమ్మద్ రఫీ ఆదివారం తెలిపారు.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారం రావడంతో రెవిన్యూ,పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో పట్టుబడిన 681కేజీల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి అక్రమంగా రేషన్ తరలిస్తున్న సిద్దవటం గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

20 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
సిద్ధవటం మండలంలోని మాధవరం-1 గ్రామ పంచాయతీ మహబూబ్ నగర్ గ్రామంలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్లు సిద్దవటం ఎస్సై మహమ్మద్ రఫీ ఆదివారం తెలిపారు.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారం రావడంతో రెవిన్యూ,పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో పట్టుబడిన 681కేజీల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి అక్రమంగా రేషన్ తరలిస్తున్న సిద్దవటం గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

