జయపురం ,సెప్టెంబర్ ,పున్నమి ప్రతినిధి;
అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ , జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణ్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన సాహితీ కిరీటి
పురస్కారానికి పాత్రికేయుడు కవి ,రచయిత సింహాద్రి శ్రీనివాస్ రావు కు ఎంపికచేసి ఆహ్వాన పత్రం పంపారు. ఈనెల 28వ తేదీన హైదరాబాదులోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించే తెలుగు సాహితీ పట్టాభిషేకం మహోత్సవంలో ఈ అవార్డు అందజేయనున్నారు. అవార్డుకు ఎన్నికైన సందర్భంగా సాహిత్య మిత్రులు కుటుంబ సభ్యులు స్నేహితులు అభినందనలు తెలిపారు.


