డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా – కాట్రేనికోన. సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి
కాట్రేనికోన మండలం సముద్రతీర ప్రాంతంలో సరుగుడు చెట్ల అక్రమ నరికివేత ఆందోళన కలిగిస్తోంది. అలల తాకిడిని అడ్డుకునే మడ అడవులు, ఉప్పు గాలులను తగ్గించే మొగలిపొదలు కనుమరుగవుతుండటంతో తీరప్రాంత ప్రజలు విపత్తుల భయంతో జీవిస్తున్నారు. బ్రహ్మసమేధ్యం పంచాయతీ పరిధిలోని నీళ్ళరేవు గ్రామం వద్ద 60 ఎకరాలకు అనుమతి ఇచ్చినా, దాన్ని మించి పెద్ద ఎత్తున చెట్లను నరికివేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అటవీ, రెవెన్యూ శాఖల నిర్లక్ష్యంతో లారీ లారీగా చెట్ల తరలింపులు జరుగుతున్నాయి. అధికారుల నిర్లిప్త వైఖరిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

