‘
భువనగిరి, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
భువనగిరి పట్టణంలోని శ్రీ నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల లో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మను రంగురంగుల పూలతో అలంకరించి, గౌరమ్మను కొల్చి ఉత్సాహంగా నృత్యాలు, బతుకమ్మ పాటలు ఆలపించారు. ప్రిన్సిపాల్ చిక్క ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక, ప్రకృతిని పూజించే పూల పండుగ అని, విద్యార్థులు ఈ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు నిలబెట్టాలి అన్నారు. బహుమతులు ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహించారు. వైస్ ప్రిన్సిపల్ ఎల్లెష్, అధ్యాపకులు పద్మ, స్పందన, ధరణి, ప్రసన్న, మౌనిక, అంబికా, రమేష్, శ్రీధర్, సంతోష్, క్రాంతి, సునిల్ తదితరులు పాల్గొన్నారు.


