రైల్వేకోడూరు సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న “సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభ” ఏర్పాట్లను ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, జిల్లా అధ్యక్షుడు, అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ గారు శనివారంసమీక్షించారు. ఈ సందర్భంగా వారు పార్టీ ప్రచారరథాలను,పోస్టర్లనుఆవిష్కరించారు.తదుపరి సభా ప్రాంగణంలో అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభ భద్రతా ఏర్పాట్లు, హెలిపాడ్ సదుపాయం, రూట్ మ్యాప్ తదితర అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ – “అనంతపురం సభతో జనసేన శక్తి మరోసారి ప్రతిఫలిస్తుంది. ప్రజల మద్దతుతో పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో బలమైనప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది. ఆయన మార్పుకు హామీ ఇస్తారు” అని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


