రాయచోటి ఆగస్టు ( పున్నమి ప్రతినిధి)
భారత ప్రభుత్వం నిర్వహించిన సులభతర వ్యాపారంపై సర్వేలో సానుకూల స్పందనతో, రాష్ట్రానికి, అన్నమయ్య జిల్లాకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, వ్యాపార సౌలభ్యానికి జిల్లా యంత్రాంగం చేయూతనిస్తుందని మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి తెలిపారు. గురువారం రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2024 అవుట్ రీచ్ కార్యక్రమం జరిగింది.


