*అక్క చెల్లెళ్లను వరించిన ఉద్యోగాలు*
*ఒకే ఇంట్లో నలుగురు ఆడ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు
*ఆడ బిడ్డలకు ఆ నలుగురు ఆదర్శం*
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, వేపమాకులపల్లికి చెందిన సీతప్పగారి లేట్ మునివెంకటప్ప, గౌరమ్మ దంపతులకు నలుగురు సంతానం. వారిలో పెద్దకుమార్తె వీణాకుమారి (2014లో ఉమెన్ పోలీస్), వాణి (2016లో SGT టీచర్), వనజాక్షి (2025 ఉమెన్ పోలీస్), శిరీష (2025 లో SGT టీచర్) లను ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. వీరి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే తండ్రి పదేళ్లకు ముందే చనిపోయాడు, తల్లి దినసరి కూలిగా పనిచేస్తూ పెంచి, పెద్ద చేసి ఉన్నత చదవులు చదివించింది. ఒక తల్లిగా వారిని పోషించడమే అసాధ్యం, ఒకెత్తు అయితే ఆ తల్లి పేరును, వంశ గౌరవాన్ని నిలిపిన నలుగురు కుమార్తెలు (దేవతలు) నిజంగా సరస్వతులే. ఆర్థిక వనరులు లేక కుటుంబ ఇబ్బందులతో ఇలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే సాధ్యంకాని రీతిలో వీరు మనకు మన పిల్లలకు భావి భారత పౌరులకు స్పూర్తి దాయకం. వెయ్యి ఏనుగుల బలం, వారి ధృఢ సంకల్పం, ఆత్మ విశ్వాసం చూస్తే మనం నమ్మలేని నిజాలుగా ఉన్నాయి, ఒకే కుటుంబంలో ఇద్దరు పోలీస్, మరో ఇద్దరు ఉపాధ్యాయిని లు కావడమే గొప్ప. ఆ విధంగా పెంచి పోషించిన ఆ మాతృమూర్తికి శతకోటి వందనాలు అలాగే ఇంతటి అత్యున్నత స్థాయికి చేరుకున్న నలుగురు అక్క చెల్లెళ్లకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.


