నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి ):వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 1,116 మంది మహిళా భక్తులకు తాంబూలాలు అందజేశారు. రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే ఆమె ఆకాంక్షించారు.


